రోడ్డు విస్తరణ.. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత..

అభివృద్ధి పనుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. తాను పాలకుడిని అనే తేడా లేకుండా, తన స్వగ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల కోసం తన ఇంటి ప్రహరీ గోడను సైతం తొలగించేందుకు అంగీకరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

గ్రామంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలోని 43 ఇళ్లను పాక్షికంగా తొలగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే, రెండు రోజుల క్రితం అధికారులు ముఖ్యమంత్రి ఇంటి ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. ప్రస్తుతం ఆ గోడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

 

ఈ విషయంపై అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ, రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులందరికీ పరిహారం అందించాలని రెండు నెలల క్రితమే ముఖ్యమంత్రి తమను ఆదేశించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకే పరిహార ప్రక్రియ పూర్తి చేసి, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు