కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో తెలంగాణ మంత్రి భేటీ..

తెలంగాణ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

 

ముఖ్యంగా, రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులను ఆదుకునేందుకు టన్ను గెలలకు కనీస మద్దతు ధర రూ. 25,000గా ప్రకటించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత స్థాయి నుంచి 44 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. ఈ చర్య వల్ల దేశీయ రైతులకు గిట్టుబాటు ధర లభించి, ఆర్థికంగా నిలదొక్కుకుంటారని తెలిపారు.

 

అదేవిధంగా, వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులను తగ్గించేందుకు రైతులు ఉపయోగించే యంత్ర పరికరాలు, సూక్ష్మ సేద్యం పరికరాలపై విధిస్తున్న 12 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని తుమ్మల కోరారు. జీఎస్టీ మినహాయింపు ఇస్తే చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఊరట కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

 

వీటితో పాటు, పీఎండీడీకేవై పథకంలో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలైన నారాయణపేట, ములుగు, ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను చేర్చాలని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ జిల్లాలను పథకంలో చేర్చడం ద్వారా అక్కడి వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత చేయూత లభిస్తుందని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు